అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులంటూ ఏపీ సీఎం మొండివైఖరీని అవలంభిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం ఆరోపించారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో నిర్వహిస్తున్న ధీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆధునిక తుగ్లక్గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
అమరావతిని రాజధానిగా నిర్మించే వరకు రైతుల పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకుని అమరావతిని నిర్మించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి గౌరవించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జగన్ మూడేండ్ల పాలనలలో రాయలసీమ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆరోపించారు.