అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం సాయంత్రం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో డాక్టర్ పేరంశెట్టి రమేశ్బాబు (64) మరణించారు. చనిపోయిన డాక్టర్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్బాబు (64) అమెరికా అలబామా రాష్ట్రంలోని టస్కలునా ప్రాంతంలో వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలుచోట్ల ఆస్పత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించారు. ఆయన సేవలకు గుర్తింపుగా అక్కడి ఓ వీధికి ఆయన పేరు పెట్టడం కూడా విశేషం.
డాక్టర్ రమేశ్బాబు తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. జమైకాలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోనే వైద్యుడిగా స్థిరపడ్డారు. కరోనా టైమ్లో విశేష సేవలందించి పలు పురస్కారాలను అందుకున్నారు. అమెరికాలో సెటిల్ అయినప్పటికీ తన స్వగ్రామంలో అభివృద్ధికి కృషి చేశారు. తాను చదువుకున్న పాఠశాల కోసం రూ.14 లక్షల విరాళం అందజేశారు. అలాగే తమ స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు అందజేసి మంచి మనసు చాటుకున్నారు.