తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు (Tirumala) చేరుకున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్ల (Compartments) లో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 64,695 మంది భక్తులు దర్శించుకోగా 24,473 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీ ఆదాయం రూ.4.60 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
తిరుమలలో విశ్రాంతి గృహం నిర్మాణానికి భూమిపూజ
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సెల్కాన్ ఆధ్వర్యంలో తిరుమలలో విశ్రాంతి గృహం (Guest House) నిర్మాణానికి శుక్రవారం ఈవో ఎవి.ధర్మారెడ్డి భూమి నిర్వహించారు. ఈ విశ్రాంతి గృహ నిర్మాణాన్ని ఏడాది లోపు పూర్తి చేస్తామని సెల్కాన్ సంస్థ చైర్మన్ వై.గురు తెలిపారు.