తిరుపతి : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ – వేలం(e-Auction) వేయనున్నామని టీటీడీ అధికారులు (Ttd Officials) వెల్లడించారు. స్వామివారికి సమర్పించిన వాటిలో కొత్తవి,ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు ఉన్నాయని తెలిపారు.
ఇందులో ఆర్ట్ సిల్క్, పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్పీస్లు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్షీట్లు,హుండీ గల్లేబులు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు,కార్టెన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయని వివరించారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org , www.konugolu.ap.govt.in సంప్రదించాలని సూచించారు.