Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా.. ఇప్పుడు కేవలం 8 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టైమ్ స్లాట్ దర్శనం (ఎస్ఎస్డీ) దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. శనివారం నాడు స్వామి వారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 31,151 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు.