Tirumala | భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు మళ్లీ భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. రూ. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.
గురువారం నాడు తిరుమల శ్రీవారిని 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.20 కోట్లుగా ఉంది.