Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని 74,498 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్లుగా ఉంది.