తిరుమల : తిరుమల (Tirumala ), తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త పాలకవర్గానికి చెందిన ముగ్గురు సభ్యులు ( Members) ఆదివారం ప్రమాణం చేశారు. వీరిలో ఒకరు ఎక్స్అఫిషియో సభ్యుడు కాగా ఇద్దరు పాలక మండలి సభ్యులున్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం 24 మందిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించింది. వీరితో పాటు మరో నలుగురిని ఎక్స్అఫిషియో సభ్యులుగా నియమించింది.
వీరిలో తుడా చైర్మన్ సి.మోహిత్ రెడ్డిని ఎక్స్ అఫిసియో సభ్యుడిగా, నెరుసు నాగసత్యం, సుదర్శన్ వేణు ఆదివారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత సభ్యులుగా టీటీడీ జేఈవో వీరభద్రం ప్రమాణం చేయించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు.
రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వీరచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకరత్నం, గోవిందరాజన్, హరింద్రనాథ్, వీజీవో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.