తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో నాలుగు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (Ttd officials) వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 62,101 మంది భక్తులు దర్శించుకోగా 25,836 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని తెలిపారు.
తిరుమలలో శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం
తిరుమల(Tirumala) లోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి (Srivani tickets) టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయగా 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు.
మార్చి నుంచి వెయ్యి శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్లైన్లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ (Aadhar)కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని సూచించారు.
yadagiri gutta | మత్స్య అలంకరణలో భక్తులకు అభయమిచ్చిన యాదగిరీశుడు