తిరుమల: తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ(devotees crowd) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్మెంట్లు(compartments)నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం(sarvadarsan) 10గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు(ttd officials) వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,507 మంది భక్తులు దర్శించుకోగా 29,205 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(hundi income) రూ. 3.72 కోట్లు వచ్చిందని వివరించారు. ఈనెల 27న ఏప్రిల్ నెలకు గాను రూ.300 ప్రత్యేక దర్శనం ఆన్లైన్ టికెట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.