తిరుమల : సుప్రీంకోర్టు జడ్జి(Supreme Court Judge) జస్టిస్ జేకే మహేశ్వరి కుటుంబసభ్యులు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిషేక సేవలో వారు పాల్గొని పూజకార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వారిని టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల ప్రధానద్వారం వద్ద స్వాగతం పలికారు. పూజలు అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు జడ్జి కుటుంబ సభ్యులకు వేదాశ్వీరచనం , తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 13 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,707 మంది భక్తులు దర్శించుకోగా 28,676 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చిందని వెల్లడించారు.