తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.75 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers) తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వెల్లడించారు. కాగా నిన్న శ్రీవారిని 76,555 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా 33,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.