తిరుపతి : ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. ఈనెల 29న ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.