తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న శ్రీ వేంకటేశ్వరస్వా్మి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది . శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో స్వామివారి సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 58,874 మంది భక్తులు దర్శించుకోగా 17,133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.50 కోట్లు వచ్చిందని తెలిపారు.