అమరావతి : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వారాంతపు సెలవుల కారణంగా తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం గుడ్ప్రైడేతో పాటు శనివారం మినహా ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి. సేవాసదన్ (Sevasadan) వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు . నిన్న స్వామివారిని 60,958 మంది భక్తులు దర్శించుకోగా 31, 245 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.41 కోట్లు వచ్చిందని తెలిపారు.