తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఫిబ్రవరి-2024 నెలలో దర్శించుకునేందుకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి. ప్రతి నెలవారీ కోటాను టీటీడీ 24,25 వ తేదీల్లో విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి కోటాను దక్కించుకునేందుకు భక్తులు పోటాపోటి పడ్డారు.
చాలా సేపు సర్వర్ బిజీ రావడంతో కొందరు భక్తులు దర్శన టికెట్ల కోసం ఆన్లైన్లో కుస్తీ పడ్డారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్ కూడా అరగంటలోనే పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బస చేసేందుకు కొండపై ఉన్న వసతి గదులతో పాటు తిరుపతిలోని వసతి గృహాల స్లాట్ను విడుదల చేసింది.