Tirumala | ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమలకు వచ్చే భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్, నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష సందర్భంగా ఈవో జవహర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ నెల 13వ తేదీన వేకువజామున 12:05 గంటలకు వైకుంఠద్వారం తెరుస్తామని, ఉదయం 1:45 గంటల నుంచి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామన్నారు. తిరుమల వచ్చిన ప్రముఖులకే టికెట్లు కేటాయిస్తాం. వీఐసీ సిఫారసు లేఖలకు టికెట్లు కేటాయించమని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా శ్రీవారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈవో సూచించారు. భక్తులంతా మాస్కులు, శానిటైజర్లు వినియోగించాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)కు చెందిన శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి పూణెకు చెందిన సాగర్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ శుక్రవారం రూ.1, 00,11,000 విరాళంగా అందించింది. కంపెనీ ప్రతినిధి రూ.కోటి పదకొండు వేల రూపాయల చెక్కును తిరుమలలోని డోనర్ సెల్ కార్యాలయంలో డోనర్ సెల్ డిప్యూటీ ఈఓ పద్మావతికి అందజేశారు.