తిరుమల : తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (sarvadarsan ) కలుగుతుందని టీటీడీ అధికారులు( ttd officials) వెల్లడించారు.
నిన్న స్వామివారిని 60,682 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 24,291 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.32 కోట్లు వచ్చిందని తెలిపారు.
విద్యాదాన ట్రస్ట్ కు 10 లక్షలు విరాళం
తిరుపతికి చెందిన కె.శ్రీనివాస్ జగదీష్ చంద్ర అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10,01,016 విరాళంగా అందించారు. విరాళాన్ని తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో జేఈవో సదా భార్గవికి అందజేశారు. దేవస్థానం విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర రెడ్డి పాల్గొన్నారు.