తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో ( Compartments ) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు (Devotees) గంటలో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 69,378 మంది భక్తులు దర్శించుకోగా 28,371 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.3.76 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
ఆగస్టు 1న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి : తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం ఆలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం, ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తామని అన్నారు.