తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని భక్తులే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు(Devotees) స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. సర్వదర్శనం(Sarvadarsan) కోసం 10 కంపార్టుమెంట్లల్లో(Compartments) భక్తులు వేచి యున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 76,041 మంది భక్తులు దర్శించుకోగా 28,336 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల వల్ల టీటీడీ హుండీకి రూ. 3.06 ఆదాయం(Hundi Income) వచ్చిందని వివరించారు.