తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయి కృష్ణతేజ గెస్ట్హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 69,483 మంది భక్తులు(Devotees) దర్శించుకోగా 32,459 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.58కోట్లు వచ్చిందన్నారు.
జూలై 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
టీటీడీ ఆధ్వర్యంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు తిరుపతి గోవిందరాజస్వామి సత్రాల్లో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.మూడు రోజుల పాటు ఉదయం భజన మండళ్లతో సుప్రభాతం, సామూహిక భజన కార్యక్రమాలు చేపడతామని అధికారులు వివరించారు.
సాయంత్రం సంగీత విభావరి, ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జూలై 10న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర, సాయంత్రం అధికార ప్రముఖుల సందేశం ఉంటుందని చెప్పారు. జూలై 12వ తేదీ ఉదయం 4 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తామని వెల్లడించారు.