తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు(Tirumala) చేరుకుంటున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 22 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు(Ttd Officials) వెల్లడించారు. నిన్న స్వామివారిని 75,652 మంది భక్తులు దర్శించుకోగా 37,027 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.21 కోట్లు వచ్చిందని వివరించారు.
మే 15న వాచీలు ఈ-వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను(Watches) మే 15న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్వెల్, ఫాస్ట్ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి. కొత్తవి,ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 18 లాట్లు ఈ-వేలంలో ఉంచామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు.