తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు(Tirumala) చేరుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా స్వామిని దర్శంచుకునేందుకు భక్తులు వస్తుండడంతో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఏడుకొండల బాలాజీని 71,488 మంది భక్తులు దర్శించుకోగా 19,137 మంది తలనీలాలు సమర్పించుకన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం( Hundi Income) రూ.4.17 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD) తెలిపారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు
తిరుపతి (Tirupati) శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ముగిశాయి. చివరిరోజు రాత్రి శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ చంద్రశేఖరస్వామి తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో దేవేంద్ర బాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.