తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న 62,494 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27, 666 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు వచ్చిందని తెలిపారు.