తిరుమల : తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు ( Compartments) అన్నీ నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్హౌస్ వరకు క్యూలైన్లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 57,443 మంది భక్తులు దర్శించుకోగా 28,198 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ.3.90 కోట్లు వచ్చాయని వివరించారు.