తిరుమల : తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 78,726 మంది భక్తులు దర్శించుకో , 26,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం (Devotees Crowd) రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించారు.