తిరుమల : వారాంతపు సెలవు దినం కారణంగా తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో కంపార్ట్మెంట్లు ( Compartments) అన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు( Devotees) 24 గంటల్లో స్వామివారి దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 87,171 మంది భక్తులు దర్శించుకోగా 38,273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (hundi Income) రూ.3.68 కోట్లు వచ్చిందని వివరించారు.
ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగగా అనంతరం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనాన్ని నిర్వహించి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారథి, వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, కంకణభట్టార్ ఆనందకుమార దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.