తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల (Tirumala) క్షేత్రం రద్దీగా మారింది. శనివారం భక్తుల తాకిడితో కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,140 మంది భక్తులు దర్శించుకోగా 26,870 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.