తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి(Sri Venkateshwar)ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమల(Tirumala)కు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న 5 కంపార్ట్మెంట్లు(Compartments) భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం(Sarvadarsan) లభిస్తుందని తెలిపారు. నిన్న శ్రీవారిని 69,781 మంది భక్తులు దర్శించుకోగా 27,552 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 5.16 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు(Ttd officials) వివరించారు. ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో డాక్టర్ నవ్య, టీటీడీ అధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.