తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి క్యూలైన్లో నిలిచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న 64,040 మంది భక్తులు దర్శించుకోగా 21,527 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.17 కోట్లు వచ్చిందని తెలిపారు.