తిరుమల : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్ 1 నుంచి టైమ్స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. టోకెన్లు తిరుపతిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని వివరించారు.
ఉదయం 8.30 నుంచి బ్రేక్దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు ఇ-బైక్లు అందజేస్తామని అన్నారు.