అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. మూడో విడత అమ్మ ఒడి పథకంలో భాగంగా ఇవాళ ఆయన శ్రీకాకుళంకు చేరుకున్నారు. సీఎం పర్యటనకు ఆటంకం కలుగకుండా ప్రతిపక్ష టీడీపీతో సహ వామపక్ష పార్టీలకు చెందిన నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధం చేశారు. సీపీఎం నేత గోవిందరావుతో పాటు మరికొందరిని పోలీసు స్టేషన్కు తరలించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి కిశోర్కుమార్ను గృహనిర్బంధం చేశారు.