అమరావతి : అంబేద్కర్ కోనసీమ (Ambedkar Konaseema) జిల్లా రావులపాలెంలో విషాదం చోటు చేసుకుంది. రావులపాలెం గ్రామానికి చెందిన యువకులు గోదావరి (Godavari) నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. మృతులు ఈశ్వర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, సంపత్రెడ్డి, జయకుమార్గా గుర్తించారు. మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) గజ ఈతగాళ్లతో మృతదేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.