అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట వద్ద జాతీయ రహదారిపై కారు విద్యుత్ స్తంభాన్నిఢీ కొట్టింది. అందులో ఉన్న ఆరుగురిలో ఇద్దరు ఘటన స్థలంలోనే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.మృతులు ధవళేశ్వరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. గాయపడ్డ మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.