తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి టీవీఎస్ మోటార్స్ సంస్థ వాహనాలను విరాళంగా అందించింది. రూ. 4.50 లక్షల విలువైన మోటారు వాహనాలను టీవీఎస్ మోటార్స్ ప్రెసిడెంట్ అనంత కృష్ణన్ టిటిడి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ. వీ.ధర్మారెడ్డికి అందించారు. ఒక ఆటో, రెండు టీవీఎస్ బైక్లతో సహా మూడు వాహనాలను శనివారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస ఏజెన్సీకి చెందిన భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.