అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించారు. గడిచిన 24 గంటలో 31,158 మంది నుంచి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 164 మంది కోలుకున్నారని వివరించారు.
చిత్తూరులో 35 మంది, గుంటూరులో 18మంది, కృష్ణా జిల్లాలో 23 మంది, విశాఖపట్నం జిల్లాలో 14 మంది, వెస్ట్ గోదావరిలో 15 మంది అత్యధికంగా కరోనా బారిన పడ్డారని వెల్లడించారు.