అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు
మరణించారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చనిపోయారని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,474కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 33,043 మందికి పరీక్షలు నిర్వహించామని వారు పేర్కొన్నారు.
ఒక్కరోజే 152 మంది బాధితులు కోలుకోవడం ద్వారా మొత్తం 20,59,131 మంది బాధితులు కోలుకున్నారు. కాగా చిత్తూరు, గుంటూరు, ఈస్ట్గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, వెస్ట్గోదావరి, విశాఖ జిల్లాలో కేసుల నమోదు సంఖ్య అధికంగా ఉంది.