అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ తో ముగ్గురు మృతి చెందారని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో వివరాలను వెల్లడించారు. కృష్ణా, విశాఖపట్నం , గుంటూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు ఏపీలో 32036 మందికి కరోనా నమూనా పరీక్షలు నిర్వహించగా 186 మందికి కరోనా సోకిందని తెలిపారు. మరో 191 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,05,39,041 మంది శాంపిల్స్ను పరీక్షించామని తెలిపారు.