అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా(Anakapalli)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ముగ్గురు మృతి చెందారు. వివరాలు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం కారు(Car) లో అనకాపల్లికి బయలు దేరింది. జిల్లాలోని సంకరం వద్ద జాతీయ రహదారి(National Highway} పై వీరు ప్రయాణిస్తున్న కారు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా కారు బోల్తా (Overturn) పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, బాలుడు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.