అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చొప్నున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 31,131 మందిని పరీక్షించగా 156 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయ్యిందని ఏపీ వైద్యులు వెల్లడించిన హెల్త్ బులిటెన్లో తెలిపారు.
ఒక్క రోజులోనే 188 మంది కోలుకోగా ప్రస్తుతం 1,954 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 31 మందికి, ఈస్ట్గోదావరిలో 11 మందికి, గుంటూరులో 24 మందికి, కృష్ణాలో 18 మందికి, శ్రీకాకుళంలో 10మందికి, విశాఖపట్నంలో 12, వెస్ట్గోదావరిలో 27 మంది కొవిడ్ బారిన పడ్డారని వైద్యులు తెలిపారు.