అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై తవనంపల్లె మండలం కాణిపట్నం గ్రామం వద్ద కారు పాల ట్యాంకర్ను ఓవర్టేక్ చేయబోయి వెనుక నుంచి వచ్చి ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కాగా కారులో చిక్కుకుని నుజ్జునుజ్జైన మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.