అమరావతి : కరోనా వైరస్ బారినపడి రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు.
గుంటూర్ జిల్లా ఈపూరు మండలం కొచర్ల గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో తల్లిదండ్రులతోపాటు కుమారుడికి ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి కుమారుడు మృతి చెందాడు. అనంతరం గంటల వ్యవధిలో తల్లి సైతం ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ సాయంత్రం తండ్రి కూడా కన్నుమూశారు.
కుమారుడు పోస్ట్మ్యాన్గా పనిచేస్తుండగా తండ్రి పోస్ట్మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.