అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ గూబగుండం వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న జీపు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేశ్వరు్ విజయలక్ష్మి, సామ్రాజ్యమ్మ గా పోలీసులు గుర్తించారు.
గాయపడ్డ వారిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.