అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో (Anantapur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లమూడ మండలం పులగంపల్లి వద్ద మినీబస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకన్నారు. క్షతగాత్రులను కదిరి దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 15 మంది ఉన్నారని తెలిపారు.
బాధితులందా పులగంపల్లికి చెందినవారని వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరో పది నిమిషాల్లో సొంతూరుకు చేరుకుంటామనగా ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదం నెలకొన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.