నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నెల్లూరు జిల్లా మునుబోలు మండలం బద్వేలు (Badvel) వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని (Container) ఓ కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. అయితే ప్రమాదానికి గురైన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్నది.