అమరావతి : అనంతపురం జిల్లా సింగనమల మండలం మరుగుకొమ్మ క్రాసింగ్ వద్ద ఉన్న రంగరాయల చెరువులో మూడు మృతదేహాలు లభ్యం కావడం కలకలం సృష్టిస్తుంది. తల్లి , ఇద్దరు పిల్లల మృతదేహాలను గమనించిన గ్రామస్థులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. తల్లి వయస్సు (35 ) , బాలుడు(7 ), బాలిక (4) వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మృతుల ఆచూకి కోసం అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మహిళ కుడి చేతిపై బి. రామానుజ అనే పచ్చబొట్టుతో రాసి ఉందని వివరించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు.