Tirumala |తిరుమల : తిరుమలోని స్థానిక ఆర్బీసీ సెంటర్కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశమయ్యారు. తిరుమల టుటౌన్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలకు చెందిన ఎస్ కృష్ణ తనయుడు చంద్రశేఖర్, యోగేశ్ కుమారుడు వైభవ్ యోగేశ్, శ్రీవరదన్ అదృశ్యమైనట్లు తెలిపారు. అదృశ్యమైన ముగ్గురు పిల్లల వయసు 13 సంవత్సరాలు.
ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం పుస్తకాలు తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్తామని పాఠశాలలో చెప్పారు. ఇంటికి వచ్చి ల్యాప్టాప్ తీసుకుని బస్సెక్కి తిరుపతి ఏడు కొండల బస్టాండ్కు చేరుకున్నారు. అక్కడ్నుంచి వారి ఆచూకీ తెలియలేదు. విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, పాఠశాల టీచర్లను ఆరా తీశారు. వారు కూడా తెలియదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.