ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. కంబం నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ కారు లారీని ఢీకొట్టింది. ఈ కారు లారీని ఢీకొనడంతో కారులో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైపోయింది.
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ సజీవ దహనమైపోయారు. మరోవైపు కారులో చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఇక.. ఈ ఘటన జరగడంతో లారీ డ్రైవర్, క్లీనర్ లారీని అక్కడే విడిచి, పరార్ అయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సి వుంది.