అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. సముద్రస్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురి మృత దేహాలు రణ స్థలం మండలం జీడిపాలెం వద్ద లభ్యమయ్యాయి. నిన్న రణ స్థలం మండలం ఎన్.జీ.ఆర్ పురం తీరంలో విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నగరప్పాలెం గ్రామానికి చెందిన గణేశ్(32), దీవెన(18), మానస(9) సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న తీరప్రాంత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలుపుదల చేశారు. ఇవాళ ఉదయం ఈ ముగ్గురు మృతదేహాలు జీడిపాలెం వద్ద లభ్యమయ్యాయి. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.