అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో సీఐడీ విచారణను వేగవంతం చేసింది. డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్లు చేతులు మారినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు ముంభై, పుణెలకు చెందిన డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వేల్కర్, సీమెన్స్ మాజీ ఎండీ సౌమాద్రి శేఖర్, ముగుల్ అగర్వాల్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు షెల్ కంపెనీలుగా ముంబై, పుణె సంస్థలు శిక్షణ పేరిట ఆంధ్రప్రదేశ్లో అక్రమాలకు పాల్పడ్డారని 2018లో కేంద్ర జీఎస్టీ అధికారుల ఆదేశాలతో అప్పట్లో ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు.
అప్పటి ప్రభుత్వం దర్యాప్తు జరుపలేదని, స్కాంలో ప్రముఖుల పాత్ర ఉండడంతో విచారణ ముందుకు సాగలేదని సీఐడీ వివరించింది. ప్రస్తుతం తాజా దర్యాపులో వాస్తవాలు నిర్ధారణ అవుతున్నాయని స్పష్టం చేసింది, విచారణలో అప్పటి పెద్దల ప్రమేయం ఉందని నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది,